జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ ఎం.ఎ. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలు ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు, బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ, ‘మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని, అదే విధంగా సినిమా సక్సెస్కి కారణం ప్రేక్షకుడు కాబట్టి జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ, సపోర్ట్ మాపై, ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సరికొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’ అని తెలిపారు.
బోయినపల్లి హనుమంతరావు, ‘ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు రావాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.