కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ హెడ్‌ ఆఫీసులో సోదాలు

నవతెలంగాణ -కడప: కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్‌ కంపెనీలో శనివారం ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉండడంతో ఇక్కడ నుంచి డబ్బుల పంపిణీ జరుగుతున్నట్లు అనుమానం రావడంతో సోదాలు చేసినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు కంపెనీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇదే కంపెనీలో నాలుగు నెలల క్రితం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల తరుణంలో సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Spread the love