- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ రాష్ట్ర స్థాయి సమర్థ శిక్షణ శిబిరంలో భాగంగా రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరానికి నవాపేటకు చెందిన సేవాదళ్ నాయకులు ఎండి ఉమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను పార్టీ విధి విధానాలలో భాగంగా ఇచ్చే శిక్షణలో పాల్గొని పార్టీకి నిబద్ధతతో కూడిన కార్యకర్తగా పనిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. టీపీసీసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తనకు శిక్షణలో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి నిరంతరం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



