ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణ 

– జుక్కల్ అసెంబ్లీ బరిలో 17 మంది అభ్యర్థుల పోటీ
నవతెలంగాణ- మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ జుక్కల్ కు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు బుధవారం నాడు ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను సంహరించుకున్నారు పోటీలో 17 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అధికారి అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ విలేకరులకు తెలిపారు. ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. రేవంత్ సర్ దేవర్ ఇండిపెండెంట్ సారిక మకై ఇండిపెండెంట్ రామ్ చందర్ బుక్క వార్ ఆలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ గంగారం సౌదాగర్ ఇండిపెండెంట్ కర్రోళ్ల మోహన్ ఇండిపెండెంట్ బుక్క వార్ సాయిలు ఇండిపెండెంట్ గంగారం ఇండిపెండెంట్. ఈ విధంగా నామినేషన్ల ఉపసంహరణ రోజున ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు  సంహరించుకున్నట్లు మిగిలిన 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Spread the love