హైదరాబాద్ లో ఘోరం..అపార్ట్మెంట్ గోడ కూలీ ఏడుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం సాయంత్ర నుంచి రాత్రి వరకు మహానగరం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షానికి హైదరాబాద్ బాచుపల్లి లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలిపోయింది. దీంతో ఏడుగురు కార్మికులు గొడవ కింద చిక్కుకుని మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. అలాగే మృతులు తిరుపతి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు(4) గా పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీసి క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం బాచుపల్లి మమత ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఓ మహిళ నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నారు.

Spread the love