పార్లమెంట్ లో రఘురామకృష్ణంరాజుకు అవమానం..

నవతెలంగాణ- అమరావతి: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆ పార్టీ విశాఖ ఎంపీ ఎంవీవీ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ మధ్యకాలంలో ఎంవీవీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై లోక్ సభ స్పీకర్ కు ఎంవీవీ లేఖ రాశారు. ఈ అంశంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి సంబంధించిన విషయం గురించి నీవు ఎలా లేఖ రాస్తావని మండిపడ్డారు, బూతులు తిట్టారు. చంపుతాను అని బెదిరించారు. ఈ సమయంలో పక్కనే మరో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంవీవీ తిడుతున్నంత సేపు మిథున్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. రఘురామకృష్ణరాజు కూడా ఎంవీవీ తిడుతుంటే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఎంవీవీని మిథున్ రెడ్డి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

Spread the love