శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజ

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు శ్రావణ మాస పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి సింధూర పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో, ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాలతి సంతోష్ గుప్తా, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు ఇస్సాయిపేట బైరయ్య, రాజేందర్ గౌడ్, ఈవో ప్రభు, సిబ్బంది సురేందర్, నాగరాజు, పూజార్లు శ్రీనివాస్ శర్మ, మణిశర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love