సీతారాముల వారి అక్షింతల శోభాయాత్ర..

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం వీరన్న గుట్ట రామాలయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య సీతారాముల అక్షంతల శోభాయాత్ర ఘనంగా జరిపారు. మంగళవారం సీతారాముల వారి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిరి వేణి శంకర్, గ్రామ సర్పంచ్ బైండ్ల రాజు, పెద్ద రాజు, గుంజే గంగాధర్, రాయ నర్సు, దేవేందర్, రాజేందర్, అభినయ గౌడ్, పాల్గొనగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
Spread the love