రైల్వే లైన్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి.. 

– ఆందోళన చేస్తున్న రైల్వే లైన్ భూనిర్వాసితులు 
– అలైన్మెంట్ మార్చండి లేదా గెజిట్ నుండి తొలగించండి: డాక్టర్ కొండ దేవయ్య 
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే లైన్ లో భూములను కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ముఖాస సత్రం ప్రాంతంలో భూ నిర్వాసితులతో కలిసి ఆయన సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైల్వే లైన్ అలైన్మెంట్ ను మార్చాలని లేనియెడల గెజిట్ లో నుండి మా భూములను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. .సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరించడం పై ఆయన మండిపడ్డారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులు స్పందించి రైల్వే లైన్ భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని లేని ఎడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డాక్టర్ కొండ దేవయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో సుమారు 40 మంది భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
Spread the love