టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

నవతెలంగాణ – అమరావతి : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.
సస్పెండైన ఎమ్మెల్యేలు
– కింజరాపు అచ్చెన్నాయుడు
– నందమూరి బాలకృష్ణ
– బెందాళం అశోక్‌
– ఆదిరెడ్డి భవాని
– గోరంట్ల బుచ్చయ్యచౌదరి
– నిమ్మకాయల చినరాజప్ప
– ఏలూరి సాంబశివరావు
– నిమ్మల రామానాయుడు
– గణబాబు
– గొట్టిపాటి రవికుమార్‌
– డోలా బాలవీరాంజనేయ స్వామి
– వెలగపూడి రామకృష్ణబాబు
– గద్దె రామ్మోహన్‌

Spread the love