ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నమూత

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన మొత్తం 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు. వాటిల్లో ముంబై, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. వయోసంబంధిత సమస్యలతో సినీపరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన చివరిసారిగా రజనీకాంత్‌ నటించిన దర్బార్‌ సినిమాకు డైలాగ్స్‌ రాశారు. రామకృష్ణ మృతిపట్ల సింగర్‌ మనోతోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Spread the love