![](https://navatelangana.com/wp-content/uploads/2024/04/IMG-20240405-WA06501.jpg)
నవతెలంగాణ – మల్హర్ రావు
నేడు శనివారం మంథనిలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం, శ్రీపాద రావు వర్థంతి సభను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య శుక్రవారం ఒక ప్రకటన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కీ.శే స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు వర్ధంతి సభను విజయవంతం చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు మహిళ నాయకురాల్లు, యూత్ కాంగ్రెస్, దళిత కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, అన్ని అనుబంధ నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.