స్తంభించిన ట్రాఫిక్

నవతెలంగాణ – దంతాలపల్లి
ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామ శివారులో సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం సూర్యాపేట నుంచి మంచిర్యాలకు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ పంచర్ కావడంతో రిపేర్ చేస్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో సిమెంట్ లోడ్ లారీ ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోగా స్పందించిన దంతాలపల్లి పోలీస్ సిబ్బంది గణేష్ జేసీపీ సహాయంతో రోడ్డుపై ఉన్న లారీలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సమస్యను పరిష్కరించారు.

Spread the love