విభూది పూసి బంగారం చోరీ..

నవతెలంగాణ-భిక్కనూర్
నుదుటిన విభూతి పూసి బంగారం చోరీ చేసిన ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన రాజు, దుర్గ ప్రసాద్ బస్టాప్ వద్ద బస్ కోసం వేచి చూస్తుండగా కారులో బాబా వేషంలో వచ్చిన వ్యక్తి నుదుటిన విభూది పూయగా మైకంలోకి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు చేతికి, మెడలో ఉన్న 12 గ్రాముల బంగారాన్ని బాబా వేశంలో ఉన్న వ్యక్తికి ఇచ్చేశారు. తిరిగి ఇంటికి వెళ్లి మైకం నుండి మేలుకోగానే చేతికి, మెడలో ఉంగరాలు, బంగారు చైను లేకపోవడంతో విభూది పూసి బంగారం చోరి చేసినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు, త్వరలోనే నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.

Spread the love