కేటీఆర్ పిచ్చికూతలు మానుకో..

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధికారాన్ని కోల్పోయామని మతిస్థిమితం పోయి పిచ్చికూతలు మాట్లాడటం మానుకోవాలని శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులను పట్టించుకోకపోవడంతో, ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరిచిపోయావా, సర్పంచులకు నిధులు మంజూరు చేయాలని రెచ్చగొట్టే మాటలను మానుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతున్న ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు చెల్లిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, అభివృద్ధికి సహకరించాలి, అధికారం పోగానే, మతిస్థిమితం పోయి మాట్లాడితే, పిచ్చి ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇకనైనా దొరల అహంకారాన్ని వదిలి, ప్రజల కోసం, అభివృద్ధి కోసం సహకరించాలని డిమాండ్ చేశారు.

Spread the love