నార్సింగిలో డ్రగ్స్‌ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన విద్యార్థి…

నవతెలంగాణ – హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సన్‌సిటీ వద్ద డ్రగ్స్ తీసుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. అతని వద్ద లభించిన 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజ్‌లు,  ఓ వెయింగ్ మిషన్‎తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. డ్రగ్స్‎ తో పట్టుబడిన విద్యార్థిని సాకేత్‌గా గుర్తించారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం అని పోలీసులు తెలిపారు. అతడు బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్‎ ను రాజేంద్రనగర్ ప్రాంతంలో అమ్మడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతనిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరులో అతనికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అనే కోణంలో విచారిస్తున్నారు.

Spread the love