గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సురేష్

నవతెలంగాణ-పెద్దవంగర: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుంపల కుమారస్వామి, వేముల వెంకన్న తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తుందని అన్నారు. గ్రామాల్లోని అర్హులను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందజేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుంపల ఉప్పలయ్య, దుంపల అశోక్, వేముల ప్రభాకర్, గ్రామ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముసుకు కవిత, ముసుకు మల్లయ్య, వేముల యాకన్న, మాజీ సర్పంచ్ దుంపల రామానుజం, పెంతల సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love