బీజేపీకి స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక

నవతెలంగాణ హైదరాబాద్: తనకు హిందూపురం ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన స్వామి పరిపూర్ణానందకు చివరకు నిరాశే మిగిలింది. బీజేపీ ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు. పెనుగొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో తానెందుకు హిందూపురం నుంచే పోటీ చేయాలనుకుంటున్నానో పరిపూర్ణానంద స్వామి తెలిపారు. దక్షిణాదిలో హిందూపురం ఎంతో ముఖ్యమైన ప్రాంతమని అన్నారు. ‘హిందూపురం’లో హిందూ అనే పేరు ఉందని, అందుకే తాను అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. మొదట్లో బీజేపీ అధిష్టానం తనకే హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించిందని, కానీ పొత్తులో భాగంగా అది దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా.. తాను స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని, ఇప్పటికే తన ఎన్నికల ప్రచార ప్రక్రియను కూడా మొదలుపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.

Spread the love