నామా ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోండి..

– టెలీకాం అడ్వైజరి కమిటీ సభ్యులు – బిర్రం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అందిస్తున్న సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  టెలీకాం అడ్వైజరి కమిటీ సభ్యులు బిర్రం వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదేశాలు మేరకు శనివారం నామా ముత్తయ్య మెమోరియల్  ట్రస్ట్ ఆధ్వర్యంలో,అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పర్యవేక్షణలో  మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం మొద్దులు మడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ముందస్తుగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.అనారోగ్య సమస్యలు ఉండి తన దృష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎం.పీ నామ నాగేశ్వరరావుల దృష్టికి తీసుకు వెళ్లి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు. 28 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.రక్త నమూనాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్, హెచ్.ఇ.ఒ రాజు, ఎ.ఎన్.ఎం, ఆశా, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love