ప్రతిభే ప్రామాణికం

– సెలక్షన్స్‌పై శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌
హైదరాబాద్‌: ఓయూలోని సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లో జరుగుతున్న రెజ్లింగ్‌, సైక్లింగ్‌ సెలక్షన్స్‌ను శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ గురువారం పరిశీలించారు. ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలే గీటురాయిగా ఉండాలని, ప్రతిభ ఆధారంగా సెలక్షన్స్‌ చేపట్టాలని సూచించారు. మెరుగైన వసతులు, నిపుణులైన కోచ్‌లతో శాట్స్‌ అకాడమీలు తెలంగాణ రాష్ట్ర క్రీడా రంగానికి పునాదులుగా నిలుస్తున్నాయని.. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ ఏకెఎన్‌ గోకుల్‌కు సూచించారు.

Spread the love