- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలం పెద్దతూండ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే పల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవలు, అనుభవించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



