ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా

నవతెలంగాణ – హైదకాబాద్: ఐదు టెస్టుల సిరీస్‌లో బెన్ స్టోక్స్ సేనను చిత్తుగా ఓడించేందుకు టీమిండియావ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. జ‌వ‌వ‌రి 25 నుండి జ‌రుగ‌నున్న‌ తొలి టెస్టు కోసం భార‌త జ‌ట్టు హైద‌రాబాద్ చేరుకుంది. టీమ్ హోట‌ల్ నుంచి మంగ‌ళ‌వారం రోహిత్ సేన ఉప్ప‌ల్‌ స్టేడియానికి వెళ్లింది. అక్క‌డ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.  పేస‌ర్ సిరాజ్, ఆఫ్ స్పిన్నర్ అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంత‌రం ఆట‌గాళ్లంతా మైదానంలోనే కాసేపు రిలాక్స్ అయ్యారు. టీమిండియా ప్రాక్టీస్ సెష‌న్‌ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

Spread the love