తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు 

నవతెలంగాణ- వీర్నపల్లి 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని ఎంపిపి మాలోతు భూలా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో మంగళ వారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతు చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని, నిజాం నవాబు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్పయోధురాలని కొనియాడారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటి దినకర్, ఎంపిటిసి అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, రజక సంఘం మండల లోకుర్తి అధ్యక్షులు దేవయ్య, ఎ ఎం సి డైరెక్టర్ దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్, వీర్నపల్లి గ్రామ రజక అధ్యక్షులు లోకుర్తి అంజయ్య,నాయకులు రజక సంఘం సభ్యులూ తదితరులు పాల్గొన్నారు .
Spread the love