ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ యువత, విద్యా ర్థుల త్యాగాల ఫలితం. అమ్మ సోనియమ్మ కరుణ తోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయింది’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి, సోనియమ్మకే దక్కిందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడు కలు జరపాలని, ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Spread the love