నేటి నుంచి గురుకుల విద్యార్థులకు చెస్‌ టోర్నమెంట్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గురుకుల విద్యార్థులకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు చెస్‌ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ గురుకులాల విద్యా సంస్థల కార్యదర్శి రోనాల్ట్‌ రాస్‌ పేర్కొన్నారు. వర్ధమాన చెస్‌ క్రీడాకారులకు తగిన వేదికను అందించడానికి, వారి రేటింగ్‌ మెరుగుపరచుకోవడానికి మరియు ఉత్తమ రేటింగ్‌ పొందిన ఆటగాళ్లతో ఆడే అవకాశాన్ని కల్పించడానికి ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నారు.ఈ టోర్నీ 3 రోజుల పాటు జరగనుంది. రోజూ 3 రౌండ్లు ఈ టోర్నమెంట్‌ 693 క్రీడాకారులు పాల్గొంటారు. ప్రైజ్‌ మనీగా మొత్తం రూ. 4,99,999 నగదు 113 నగదు పురస్కారాలు విజేతల కు 105 ట్రోఫీలు పంపిణీ చేయనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 693 మంది పైబడిన క్రీడాకారులు పాల్గొననున్నారు.

Spread the love