తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పంచాయతీరాజ్ డిప్యూటీ

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల జూన్ 2 నుండి జూన్ 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి నిశ్చయించిందని 22 రోజుల పాటు నిర్వహించే దశాబ్ద ఉత్సవాలు రోజువారి కార్యక్రమాలను ప్రకటించిందని మద్నూర్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ డిప్యూటీ ఈ ఈ రవీంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే దశాబ్ది ఉత్సవాలను రోజువారి కార్యక్రమాలను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

Spread the love