బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

నవతెలంగాణ-తొగుట

బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని మెదక్ ఎంపీ,బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 45 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కోసం, నా కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన నాయకులకు,కార్య కర్తలు, ప్రజలకు,సోషల్ మీడియా వారియర్ లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ ఏ లక్ష్యంగా, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కృషి చేయ డం అభినందనీ యం అన్నారు. 3వ సారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి కావడం తధ్యం అన్నారు.
Spread the love