ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించాడు : కేజ్రీవాల్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సీఎం, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌  ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పట్ల దురుసుగా ప్రవర్తించింది కూడా ఈ పోలీసు అధికారే అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి తొలగించాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ దరఖాస్తుపై విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఈడీ సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే వ్యవహరించారని వెల్లడించారు.

Spread the love