నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములోని ఉపాదీ కూలీలు ఉపాదీహమీ పనులు చేయడానికి రామదండు మాదిరిగా కదం తొక్కారు. గ్రామమునుండి వందలాదిగా ఎఫ్ ఏ అస్పత్ వార్ సుభాష్ అద్వర్యంలో వందలాదిగా పనులకు గ్రామము నుండి బయలుదేరి వెళ్తుండటంతో రోడ్ల పైన వచ్చే పోయే వారికిి పరమానందంగా కన్పించింది. వందలాదిగా గ్రామస్తులు ఉపాదీ పనులకు వెళ్తున్న క్రమం తెలుసుకున్న ఎంపిడివో శ్రీనివాస్ పెద్ద ఎడ్గి లో క్షేత్రస్థాయి సందర్శన చేసారు. జాబ్ కార్డు ఉన్న వారందరు ప్రతి ఒక్కరు ఉపాదీ పనిచేస్తే కూలీ పూర్తీ స్థాయిలో కొలతల ప్రకారం పని చేసిన వారికి పార్తీవకూలీ అందిస్తామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్ , జీపీ కార్యదర్శి పమేష్ చారీ , ఎఫ్ఏ సుభాష్ , ఉపాదీ కూలీలు తదితరులు పాల్గోన్నారు.