మతోన్మాద బీజేపీని ఓడించాలి

– సమస్యల పరిష్కారం కోసం పని చేసేది కమ్యూనిస్టులే
– భువనగిరి ఎంపీగా ఎండీ జహంగీర్‌ను గెలిపించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు
నవతెలంగాణ-మంచాల
ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలు చేసే మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు పిలుపునిచ్చారు. సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుకు ఓటేసి భువనగిరి ఎంపీగా సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎండీ జహంగీర్‌ 35 ఏండ్లుగా ప్రజా సేవలో ఉంటూ పార్టీలో పని చేస్తున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. మిగతా పార్టీల అభ్యర్థులు నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్పా చేసిందేమీ లేదన్నారు. బీజేపీ దేశంలో మత రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల పాలనలో దేశ ప్రజలను అన్నింట్లో ఆగం చేసిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. అన్యాయంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐలతో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేసిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి, వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మార బుగ్గ రాములు, మండల కమిటీ సభ్యులు పోచమోనీ కృష్ణ, పుల్లగళ్ళ గోపాల్‌, శాఖ కార్యదర్శులు ఎం.వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్‌, నాయకులు జోగు శేఖర్‌, ఏర్పుల వీరేశం, మల్లేష్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love