ఐస్‌క్రీమ్‌లో బోటన వేలు ఘటన.. చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ

నవతెలంగాణ – హైదరాబాద్: ‘ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై దేశంలో తయారీ, నిల్వ, విక్రయాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ స్పందించింది. పూణేలోని ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంత కార్యాలయం ప్రకటించింది. పూణేలో ఐస్‌క్రీమ్ తయారీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐస్‌క్రీమ్‌ తయారీ కంపెనీ పూణేలోని ఇందాపూర్‌ ప్రాంతంలో ఉందని, కంపెనీకి సెంట్రల్ లైసెన్స్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తెలిపారు.
కాగా ఇటీవల ముంబై నగరంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీం కోన్‌ ఆర్డర్ చేశాడు. కానీ దానిని ఓపెన్ చేసి చూడగా అందులో మనిషి వేలి ఉన్నట్టు గుర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉంది.

Spread the love