పరిస్థితి విషమించి వ్యక్తి మృతి..

నవతెలంగాణ – బెజ్జంకి 
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరికుప్పుల సత్తయ్య(50)ఇటీవల అవసరాల దృష్ట్యా తన ఇల్లు,ట్రాక్టర్ పై తీసుకున్న రుణం తీర్చడం కష్టంగా మారడంతో వ్యవసాయ బావి వద్ద శుక్రవారం పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మేరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రకి తరలించగా వైద్యులు హైదరాబాద్ నిమ్స్ ఆఫ్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రాత్రి సమయంలో మృతిచెందాడు. మృతుని కుమారుడు హరీశ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. మృతునికి భార్య శోభ,ముగ్గురు కుమారులున్నారు.
Spread the love