గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌

– గుడి తండాలో సేవాలాల్‌ ఉత్సవాలు
– హాజరైన జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ఉత్సవాలు ఆదివారం మండ లంలోని మల్లాపూర్‌ తండా పరిధిలోగల గుడి తండాలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు స్థానిక జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్య నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల హక్కులకై పోరాడిన సేవాలాల్‌ మహారాజ్‌ను గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో గూడూరు మాజీ సర్పంచ్‌ సత్తయ్య, బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌ నాయక్‌ గిరిజన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love