పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జండా ఆవిష్కరనా భారీ ర్యాలీ

నవతెలంగాణ – గాంధారి
తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా గాంధారి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ పథకాల్లో భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధ బలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపిటిసి సభ్యులు పత్తి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కొమ్ముల రమేష్,కో అప్షన్ మెంబర్ ముస్తప్ప తదితరులు పాల్గొన్నారు.

Spread the love