భారీ వర్షంలోను ఆగకుండా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ- కంటేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సోమవారం కుండ పోతగా కురిసిన వర్షంలోను వారి సేవలను కొనసాగించారు. ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రి రోగులకు వారి సహాయకులకు అనంతరం రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధలకి మతిస్థిమితం లేని విదివంచితులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిండం జరిగిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. విరి నిరంతర సేవలను పలువురు అభినందించారు. వర్షంలోనూ నిరాశ్రయుల కోసం ఆకలి తీర్చడం గొప్ప విషయం అన్నారు. వీరితోపాటు వీరి కుటుంబ సభ్యులకు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు.

Spread the love