వట్టే జానయ్యపై అక్రమ కేసుల వెనుక మంత్రి హస్తం

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌
నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ చైర్మెన్‌ (డీసీఎంఎస్‌), బీసీ నేత వట్టే జానయ్య యాదవ్‌పై అక్రమ కేసులు వెనుక విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి హస్తం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జానయ్య సతీమణి రేణుక, తల్లి ఐలమ్మ ఆయన్ను లిశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. 500 మందితో కలిసి బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ జానయ్యపై భూకబ్జాలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనేమైనా ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో భూములు అడిగారా? అని ప్రశ్నించారు. జానయ్యపై అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులను రాజకీయంగా ఎదగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

Spread the love