కోడుకుకు తలకొరివి పెట్టిన తల్లి

– కుటుంబానికి అందుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత కొన్ని రోజుల క్రితం గల్ఫ్ లో గుండెపోటుతో ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన విజయ్ మృతి చెందాడు. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి రావడంతో అంత్యక్రియలకు అంత సిద్దం చేసి పెట్టారు. విజయ్ మృతదేహం వచ్చిన వెంటనే తల్లి తలకోవిరి పేట్టాడంతో  గ్రామస్తులు, బందువుల రోదనలు మిన్నంటాయి‌. విజయ్ కు తల్లి,ఒక అక్క, చెల్లి ఉన్నారు.గతంలో చెల్లి పెండ్లి సమయంలో కొంత మేరకు అప్పు చేసి వివాహం జరిపించారు.అ అప్పు తీర్చడానికి గల్ఫ్ కు వెళ్లాడు. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని రోడ్డున పడకుండా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. అప్పు తీర్చడానికి తల్లికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు.విజయ్ గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని రోధిస్తూ తెలిపారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Spread the love