రానున్న కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అది కేవలం కిందిస్థాయి క్యాడర్, నాయకుల వద్ద మాత్రమే చర్చలు జరుగుతున్నా.. మంత్రుల స్థాయిలో ఎవరూ స్పందించలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్లో నిర్వహించిన సభలో కేటీఆర్కు సీఎం పోస్టు కోసం రూట్ క్లియర్ చేశారు. ‘ఎప్పుడు, ఎక్కడా చెప్పనిది మీకు చెప్తున్నా’ అంటూ తన కొడుకును ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ తనను కోరినట్టు ప్రధాని మోడీ కుండబద్దలు కొట్టారు. ఇప్పటివరకు కిందిస్థాయిలో ప్రచారంలో ఉండగా.. మోడీ మాటలతో కేటీఆర్కు రూట్ క్లియర్ చేసినట్టు అయింది. దీన్నే అవకాశంగా భావించిన మంత్రులు.. వచ్చిందే అవకాశంగా కేటీఆర్ నెక్స్ట్ సీఎం అన్నట్టు ప్రచారం చేస్తుండటం గమనార్హం.
– మీస మధు