ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన సర్పంచ్ సాయిలు

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని లింగాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను సర్పంచ్ బత్తూరు సాయిలు రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం గ్రామపంచాయతీలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేదలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహకారంతో 24 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Spread the love