నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న రెండో ఏఎన్ఎంల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. సమ్మె చేస్తున్న వారికి అక్రమంగా ఇస్తున్న నోటీసులను ఉపసంహరించి చర్చలకు ఆహ్వానించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. షోకాజ్ నోటీసులివ్వడం అక్రమమనీ, కార్మిక హక్కులను హరించడమే అవుతుందని తెలిపారు.