రెండో ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించాలి : సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న రెండో ఏఎన్‌ఎంల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. సమ్మె చేస్తున్న వారికి అక్రమంగా ఇస్తున్న నోటీసులను ఉపసంహరించి చర్చలకు ఆహ్వానించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. షోకాజ్‌ నోటీసులివ్వడం అక్రమమనీ, కార్మిక హక్కులను హరించడమే అవుతుందని తెలిపారు.

Spread the love