ఏపీలో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

ఏపీలో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల– ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. తాజాగా ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
లోక్‌సభ అభ్యర్థులు వీరే..
విశాఖపట్నం – పులుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి – వేగి వెంకటేశ్‌
ఏలూరు – లావణ్య కావూరి
నరసరావుపేట – గార్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌
నెల్లూరు – కొప్పుల రాజు
తిరుపతి (ఎస్సీ) – డా. చింతా మోహన్‌
కడప నుంచి షర్మిల..
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

టెక్కలి – కిల్లి కృపారాణి
భీమిలి – అడ్డాల వెంకట వర్మరాజు
విశాఖ సౌత్‌ – వాసుపల్లి సంతోష్‌
గాజువాక – లక్కరాజు రామారావు
అరకు వ్యాలీ (ఎస్టీ) – శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం – రౌతుల శ్రీరామమూర్తి
గోపాలపురం (ఎస్సీ) – ఎస్‌. మార్టిన్‌ లూథర్‌
ఎర్రగొండపాలెం (ఎస్సీ) – డా. బి.అజితా రావు
పర్చూరు – నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్‌ రాజు పాలపర్తి
గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డి. రమేష్‌ బాబు
పూతలపట్టు (ఎస్సీ) – ఎం.ఎస్‌. బాబు

Spread the love