టీచర్ల సేవలు మరువలేనివి

నవతెలంగాణ- జక్రాన్ పల్లి: టీచర్ల సేవలు మరువలేనివని  గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కుమార్ అన్నారు. మండలంలోని తొర్లికొండ పాఠశాలలో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు రేణుక బదిలీపై వేల్పూర్ మండలం లక్కొర పాఠశాలకు వెళ్లడంతో వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు రేణుక తొర్లికొండ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేశారని ఆమె సేవలు మరువలేని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రేణుకను శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love