ప్రత్యేక అధికారిని ఘనంగా సన్మానించిన గ్రామస్తులు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల తహసీల్దార్ మండలంలోని దన్నూర్ గ్రామ ప్రత్యేక అధికారి గా నియమితులైన తహసీల్దార్ ఎండి ముజీబ్ కు బుధవారం ధన్నూర్ గ్రామంలో గ్రామస్తులు, ఆపాఠశాల ఉపాధ్యాయులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామానికి మండల తహసీల్దార్ ప్రత్యేక అధికారిగా నియమితులైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈసన్మాన కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ,ఆ గ్రామ పాఠశాల హెచ్ఎం ప్రకాష్, ఆ గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love