– గుజ్జుల వర్సెస్ దుగ్యాల అనుచరుల మధ్య ఘర్షణ
నవతెలంగాణ – పెద్దపల్లి
బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఘర్షణకు దిగారు. పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి జెండా చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి అనుచరులు, దుగ్యాల ప్రదీప్రావు అనుచరులకు మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్రెడ్డిపై గుజ్జుల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.