- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మోహిదిన్ సబ్ తండా పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ మాలవత్ బాలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ..ఉపాధి హామీలో అవకతవకలు తావులేకుండా పనులు చేపించాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు ఆదేశించారు. నిబంధనల ప్రకారం కొలతలు చూపించి కూలిలతో పనులు సక్రమంగా చేయించాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం బయోమెట్రిక్ హాజరు తప్పకుండ తీసుకోవాలని, వేసవి తీవ్రతాను దృష్టిలో పెట్టుకొని ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. తరచుగా నీళ్లు తాగాలని సూచించారు. ఈ కార్యక్రమములో టీఏ లు, కూలీలు ఉన్నారు.
- Advertisement -



