– ఆయకట్టులోని వరి పంటకు వరద ముప్పు
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేట పెద్ద చెరువు మత్తడి పడి వరదనీరు పొంగిపొర్లుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు ఎగువ ప్రాంతాల్లోని అబ్బాయిగూడెం, బాలన్నగూడెం, బీసీ కాలనీలకు చెందిన వరద చేరువులోకి చేరి నిండు కుండను తలపిస్తుండగా మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి చెరువు మత్తడి పడి 2 క్యూసెక్కుల నీరు వరద పారుతుంది. దీంతో ఆయకట్టులోని సుమారు 5 వందల ఎకరాల్లోని వర నాట్లు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. మత్తడితో చెరువు ప్రాంతాంలోని లోతట్టు ఆవాసాల్లోకి వరదనీరు చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబందిత అదికారులు స్పందించి లోతట్టు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.