నవతెలంగాణ-హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో మూడవ రోజు సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ క్లాసులు కొనసాగాయి. మ్యాథమెటిక్స్ స్కిల్స్ తో పాటు సేఫ్టీ రూల్స్, లెటర్ వార్డ్స్ ఎంతో చక్కగా టీచర్ మమత గారు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చారు. జూనియర్స్ కి బ్రహ్మణి , వాలంటీర్స్ సరదాగా ఆటపాటలతో ఆడించారు. ఇటువంటి క్యాంప్ పిల్లల భవిష్యత్తుకు చాలా బాగా ఉపయోగపడుతుందని అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు చెప్పారని బాలోత్సవం కార్యదర్శి ఎన్ సోమయ్య గారు తెలిపారు.