యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు…

yuvraj singhనవతెలంగాణ – హైదరాబాద్
టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని బెదిరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో యువీ తల్లి షబ్నం సింగ్ 2022లో హేమా కౌశిక్ అనే మహిళను జోరవీర్ కు కేర్ టేకర్ గా నియమించింది. అయితే, ఆమె తీరు నచ్చకపోవడంతో ఉద్యోగంలో నియమించిన కొన్ని రోజులకే తొలగించేసింది. దీంతో సదరు మహిళ.. ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి వాట్సాప్ ద్వారా బ్లాక్ మెయిల్​ చేయడం ప్రారంభించింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో యూవీ ఫ్యామిలీ గురుగ్రామ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువీ ఫ్యామిలీ ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.

Spread the love