పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – పెద్దపల్లి: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సుల్తానాబాద్ రూరల్ మండలం మియాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన 9 మంది కూలీలు ఈరోజు ఉదయం రేగడి మద్దికుంట గ్రామ శివారులో మొక్కజొన్న చేనులో పనికి వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన లక్ష్మి(45), రాజమ్మ(50), వైష్ణవి(30) అనే ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love