కరీంనగర్‌లో భారీగా పట్టుబడిన నగదు

నవతెలంగాణ కరీంనగర్‌: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నగదు ప్రవావం జోరందుకుంది.  కరీంనగర్‌లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హోటల్‌లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్‌ తెలిపారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేవని చెప్పారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టులో డిపాజిట్‌ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love